Header Banner

మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

  Sun Jun 01, 2025 17:40        Education

మెగా డీఎస్సీ పరీక్షల హాల్‌ టికెట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్‌ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తాజాగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి వివరణాత్మక షెడ్యూల్‌ను విద్యాశాఖ జారీ చేసింది. తొలత జూన్‌ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ అవే రోజుల్లో ఆర్‌ఆర్‌బీ, యూజీసీ నెట్‌ సహా పలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలను జూన్‌ 30వ తేదీకి కుదించారు. తాజాగా జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం మొదట ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయి. అనంతరం స్కూల్‌ అసిస్టెంట్లకు పరీక్షలు జరుగుతాయి. అయితే కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్ష తేదీల్లో అందుకు అనుగుణంగా మార్పులు చేశారు.

కొన్ని పరీక్షలు మధ్యలో, మరికొన్ని చివరిలో వచ్చేలా షెడ్యూల్‌ ఇచ్చారు. దీంతో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రాత పరీక్షలు జూన్‌ 8 నుంచి 10 వరకు, ఆ తర్వాత మళ్లీ జూన్‌ 12, 13, 16, 17, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఎస్జీటీలకు జూన్‌ 13,17,18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. పీజీటీలకు జూన్‌ 8, 14, 18, 19, 20, 23, 25, 28 తేదీల్లో, టీజీటీలకు జూన్‌ 6, 11, 22, 25, 26, 27 తేదీల్లో పరీక్షలు జరిగేలా షెడ్యూల్‌ చేశారు.


 ఇది కూడా చదవండి: విశాఖ టూ శ్రీలంక ప్రత్యేక టూర్! ఇప్పుడు తక్కువ ధరలోనే!


టీజీపీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ జూన్‌ 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో కలిపి రోజుకు సుమారు 40 వేల మంది వరకు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు.

అయితే తాజాగా పలు పోస్టులకు కొందరి దరఖాస్తులను విద్యాశాఖ స్వీకరించలేదు. ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ చదివిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఛాన్స్‌ ఇవ్వలేదు. అలాగే టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులతోపాటు ఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా వారికి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రాత పరీక్షలు రాసేందుకు హాల్‌టికెట్లు జారీ చేయలేదు. ఇక పరీక్షల అనంతరం ఫలితాలను ఆగస్టు రెండో వారంలో విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. నిర్ణయించారు. ఈ పరీక్షలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 


ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

 

ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!

 

ఎన్టీఆర్ భరోసా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన! ఉదయానికే 52% పంపిణీ పూర్తి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!

 

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #MegaDSC2025 #DSCExamUpdates #DSCScheduleChange #TeacherRecruitment #EducationNews